సోషల్ మీడియాలో మహిళలను అవమానించే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
🔹 మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్థసారధి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు రాబోతోంది.
ఈ ఉపసంఘం సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కంటెంట్పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది