నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ను ఆదేశించడంతో నేడు అనంతపురం లో జరుగనున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకుని వెలగపూడి సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్ళి పరిస్థితులను సమీక్షించనున్నారు
ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్
రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు
సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్న మంత్రి నారా లోకేష్
సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు
ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి నారా లోకేష్
నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్