అమరావతి: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియా పర్యటన చేపట్టనున్నారు. అధునాతన విద్యావిధానాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలపై అధ్యయనం చేయడం, అలాగే రాబోయే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ (విశాఖపట్నం – నవంబర్‌ 14,15) విజయవంతం చేయాలనే లక్ష్యంతో రోడ్‌షోల్లో పాల్గొనడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యాలు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంతో, **“స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌”**లో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ఫిలిప్‌ గ్రీన్‌ ఈ మేరకు మంత్రి లోకేష్‌కు ఆహ్వాన లేఖను పంపారు.

పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ సిడ్నీ, బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌ నగరాల్లోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, బిజినెస్‌ ఫోరమ్‌లు, ప్రభుత్వ ప్రతినిధులను కలవనున్నారు.

📍 పర్యటన షెడ్యూల్ ముఖ్యాంశాలు:

  • అక్టోబర్‌ 19: సిడ్నీ చేరిక. సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనడం.
  • అక్టోబర్‌ 20: యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్ వేల్స్‌, బిజినెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా, TAFE NSW సందర్శనలు.
  • అక్టోబర్‌ 21: వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, సీఫుడ్‌ ఇండస్ట్రీ, ఆస్ట్రేలియా మంత్రులతో భేటీలు.
  • అక్టోబర్‌ 22: గోల్డ్‌కోస్ట్‌ గ్రిఫిత్ యూనివర్సిటీ, బ్రిస్బేన్‌లో ట్రేడ్‌ & ఇన్వెస్ట్‌మెంట్‌ రౌండ్‌టేబుల్‌.
  • అక్టోబర్‌ 23: యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌, విక్టోరియన్‌ మంత్రులతో సమావేశాలు, వైన్‌ ఇండస్ట్రీ సందర్శన.
  • అక్టోబర్‌ 24: ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ రౌండ్‌టేబుల్‌, సీఐఐ రోడ్‌షో, విక్టోరియా క్రికెట్‌ గ్రౌండ్‌ పరిశీలన.

అక్టోబర్‌ 25న రాత్రి మెల్‌బోర్న్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు.