ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు సంబంధించి జులై 22వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 41,418 మంది దరఖాస్తులు చేసుకున్నారు. https://psc.ap.gov.in లింక్‌పై క్లిక్ చేసి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.