ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.

https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114 

🔹 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు ఆమోదం.
🔹 రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.
🔹 ఏపీ సర్క్యులర్ ఎకానమీ & వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం.
🔹 పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం.
🔹 సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఉపసంఘం సిఫార్సులకు ఆమోదం.
🔹 గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ & ఔట్సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టుల భర్తీకి ఆమోదం.
🔹 అధికారిక భాష కమిషన్ పేరును "మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్"గా మార్చే నిర్ణయం.
🔹 తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం.
🔹 పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల సవరణలకు ఆమోదం.
🔹 కడప మైలవరం వద్ద 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం.
🔹 అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు భూమి కేటాయింపు.
🔹 గుంటూరు టిడిపి కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పొడిగింపు.
🔹 చిత్తూరు సీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి 56 కొత్త పోస్టుల మంజూరు.
🔹 నాలా పన్ను 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీలకు కేటాయింపు.
🔹 ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
🔹 మద్యం ప్రాథమిక ధరలు & విదేశీ మద్యం బ్రాండ్లపై టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం.

👉 మొత్తంగా, ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి, పర్యాటకం, శక్తి ప్రాజెక్టులు, ఆరోగ్య రంగం, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు వంటి విభాగాల్లో కీలక ప్రగతి సాధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.