అమరావతి, జూలై 19:
తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి! దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ఏర్పడిన ద్రోణి, అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉండటంతో, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రకారం, రుతుపవనాలు మామూలు కంటే చురుకుగా మారినట్లు గుర్తించబడింది. ఈ ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.


📍 ముఖ్య సమాచారం:

🔹 ద్రోణి: తూర్పు-పశ్చిమ దిశలో 13° ఉత్తర అక్షాంశం వెంబడి విస్తరించి, దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
🔹 ఉపరితల ఆవర్తనం: దక్షిణ కోస్తా ఆంధ్రా పరిసరాల్లో 5.8 కి.మీ ఎత్తులో ఉండి, ఎత్తుకి వెళ్తే నైరుతి వైపు వంగుతున్నది.
🔹 అల్పపీడనం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది.


⚠️ ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు?

  • ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్
  • దక్షిణ కోస్తా ఆంధ్ర
  • రాయలసీమ
  • తెలంగాణలోని ఉత్తర జిల్లాలు

ఈ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


🛑 ప్రజలకి సూచనలు:

☔ అవసరంలేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి
🌩️ విద్యుత్ లైన్ల సమీపంలో ఉండకూడదు
🚫 నీటి ప్రవాహంలో attempt చేయొద్దు
🏫 అవసరమైతే స్కూళ్లు, కాలేజీలు మూసివేయవచ్చు