📰 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం – కీలకాంశాలు
అమరావతి అభివృద్ధి
- అమరావతిలో ప్రైవేట్ భూములే ఉన్నాయిని, రైతులకు అన్యాయం జరగదని హామీ.
- హైదరాబాద్ లాగా అమరావతిని మహానగరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం.
- గుంటూరు–విజయవాడ–తెనాలి–గ్రామాలు కలిస్తేనే మెట్రోపాలిటన్గా మారుతుందని వివరించారు.
- క్వాంటం వ్యాలీకి శ్రీకారం – క్వాంటం కంప్యూటింగ్ అనుబంధ సంస్థలు వస్తున్నాయి.
- జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతిలో ఏర్పడుతున్నాయి.
రాయలసీమ – నీటి విప్లవం
- ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరవు ఉండేదని గుర్తుచేశారు.
- అనంతపురంలో తక్కువ వర్షపాతం ఉన్నా, నీటి ప్రాజెక్టుల వల్ల పరిస్థితి మారిందని తెలిపారు.
- కోస్తా జిల్లాల కంటే అనంతపురమే జీఎస్డీపీ లో ముందంజలో ఉందని చెప్పారు.
- హార్టికల్చర్ వల్లే రైతులకు లాభం కలిగిందని వివరించారు.
పెట్టుబడులు – అభివృద్ధి
- పెద్ద సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని పెట్టుబడులు పెడతాయి; ప్రభుత్వం కూడా అదే విధానం అనుసరిస్తుందని తెలిపారు.
- చిన్న ఆలోచనలతో ఆగిపోకుండా, దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగాలని సూచించారు.
విద్యా రంగం
- ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారని చెప్పారు.
- మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణం – నిర్వహణ మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం.
- వైద్య విద్యార్థులకు, సేవలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
తుది సందేశం
- అభివృద్ధి నిరంతర ప్రక్రియ, భయపెట్టే బెదిరింపులు పనిచేయవని స్పష్టం చేశారు.